కాకినాడలోని శాంతినగర్ లో ఉన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో వేళంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతథులుగా కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సానా సతీష్ బాబు ఫౌండేషన్ క్రీడారంగాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావడంపై అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొని మాట్లాడారు. వేళంగి గ్రామంలోని క్రీడా మైదానం లో కనీస వసతులు లేవని గ్రామస్తులు ఫౌండేషన్ కు తెలపడంతో హరీష్ వెంటనే స్పందించి క్రీడా మైదానం పరిశీలించి, క్రీడా మైదానం అభివృద్ధిపరిచేందుకు ముందుకు వచ్చారన్నారు.