ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం దాదాపు 30 నిమిషాల పాటు రెండు క్లోజ్డ్ డోర్ సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. చీఫ్ బస చేసిన ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్పూర్లో ఈ సమావేశం జరిగింది.
ఒక నివేదిక ప్రకారం… ఆదిత్యనాథ్ మొదట శనివారం మధ్యాహ్నం కాంపియర్గంజ్ ప్రాంతంలోని పాఠశాలలో భగవత్ను కలిశాడు. అక్కడ ఒక సమావేశంలో, సంఘ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి రాత్రి 8:30 గంటల సమయంలో నగరంలోని పక్కీబాగ్ ప్రాంతంలోని సరస్వతీ శిశు మందిర్ను సందర్శించి ఆర్.ఎస్.ఎస్. చీఫ్తో మరో రౌండ్ చర్చలు జరిపారు.