ధీరూభాయి అంబానీ జయంతి సందర్బంగా కాకినాడ లో అంబేత్కర్ భవన్ ఆడిటోరియంలో కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జిల్లా కలెక్టర్ డా. కృతికా ముఖ్య అతిథిగా విచ్చేసారు. అంబానీ జయంతి పురస్కరించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆడిటోరియంలో పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… క్విజ్, వక్తృత్వం, డ్రాయింగ్ వంటి పోటీలలో పాల్గొనడం విద్యార్థులలో మేథో వికాసానికి దోహదం చేయడంతో బాటు, భావి జీవితంలో చైతన్యంతో ముందుకు సాగేందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుదని తెలిపారు.