గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, ఒక కంటైనర్ లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. పరారీలో ఉన్న గంజాయి సరఫరాకు పాల్పడుతున్న మరో వ్యక్తి త్వరలో అదుపులోకి తీసుకుంటామని లక్ష్మణ్ రావు తెలిపారు.