Andhra Pradesh Crime

గంజాయి రవాణా … పోలీసుల అదుపులో ఆరుగురు

కాకినాడ జిల్లా పోలీసులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో 45.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టౌన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నలుగురు, కోటనందూరులో ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. జిల్లా స్పెషల్‌ ఎన్ఫోర్ష్మెంట్‌ ఆఫీసర్‌ జి ప్రేమ్‌ కాజల్‌ తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ జిల్లా కోటనందూరు మండలం TJ నగరం గ్రామ సమీపంలోని తాటిపాక సెంటర్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పరిశీలించగా ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు నిర్ధారించారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని, రూ.38,000 విలువ చేసే 17.50 కేజీల గంజాయిని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ బస్‌ స్టేషన్‌ నుంచి టౌన్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారిలో నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు గంజాయిని కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఈబీ ఇనస్పెక్టర్‌ కెవీ స్వామి, సిబ్బంది వారిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి 28 కేజీల గంజాయి, రూ.50,930 నగదు, నాలుగు మెబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ ఎస్‌ సతీష్‌ కుమార్‌ అభినందించారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..