![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Accused-persons-with-Ganja.jpg?resize=473%2C1024&ssl=1)
కాకినాడ జిల్లా పోలీసులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో 45.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురు, కోటనందూరులో ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్ష్మెంట్ ఆఫీసర్ జి ప్రేమ్ కాజల్ తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ జిల్లా కోటనందూరు మండలం TJ నగరం గ్రామ సమీపంలోని తాటిపాక సెంటర్ వద్ద టాస్క్ఫోర్స్ సిబ్బంది పరిశీలించగా ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు నిర్ధారించారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని, రూ.38,000 విలువ చేసే 17.50 కేజీల గంజాయిని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ బస్ స్టేషన్ నుంచి టౌన్ రైల్వే స్టేషన్కు వెళ్లేదారిలో నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు గంజాయిని కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్ఈబీ ఇనస్పెక్టర్ కెవీ స్వామి, సిబ్బంది వారిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి 28 కేజీల గంజాయి, రూ.50,930 నగదు, నాలుగు మెబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అభినందించారు.