విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో విషాదఘటన చోటుచేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనీయాల్సిన తల్లి, కడుపులో బిడ్డతో పాటు కనుమూసింది. నిండు గర్భిణీ మృతిపై కుటుంభ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మరణించిందని ఆరోపిస్తూ కుటుంభ సభ్యులు నిరశనకు పూనుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం … బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామానికి చెందిన గొల్లు ఉష (28) 8వ నెల గర్భిణీ. ఆమెకు పిట్స్ రావడంతో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా వైద్యం చేస్తుండగా తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ మృతి చెందినట్టు వెద్యులు తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి మృతిరాలి భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన భార్య, పుట్టబోయో బిడ్డ ఇద్దరూ దక్కకపోడంతో కన్నీటిపర్వంతమయ్యాడు. అయితే చాలా సమయం పాటు వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు. సామాన్యుల పట్ల వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కుటుంభసభ్యులంతా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. వారిని శాంతింప చేసేందుకు ఆసుపత్రి అధికారులు, జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదం….
![IMG_20231026_103335](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/IMG_20231026_103335.jpg?resize=1080%2C452&ssl=1)