Andhra Pradesh

గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదం….

IMG_20231026_103335

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో విషాదఘటన చోటుచేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనీయాల్సిన తల్లి, కడుపులో బిడ్డతో పాటు కనుమూసింది. నిండు గర్భిణీ మృతిపై కుటుంభ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మరణించిందని ఆరోపిస్తూ కుటుంభ సభ్యులు నిరశనకు పూనుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం … బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామానికి చెందిన గొల్లు ఉష (28) 8వ నెల గర్భిణీ. ఆమెకు పిట్స్ రావడంతో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా వైద్యం చేస్తుండగా తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ మృతి చెందినట్టు వెద్యులు తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి మృతిరాలి భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన భార్య, పుట్టబోయో బిడ్డ ఇద్దరూ దక్కకపోడంతో కన్నీటిపర్వంతమయ్యాడు. అయితే చాలా సమయం పాటు వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు. సామాన్యుల పట్ల వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కుటుంభసభ్యులంతా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. వారిని శాంతింప చేసేందుకు ఆసుపత్రి అధికారులు, జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం