బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బాలయోగిస్టేడియంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రభుత్వ శాఖల శకటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా, బ్యాడ్మింటన్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్ విచ్చేశారు. తరువాత జాతియ జండాను ఆవిష్కరించి ప్రతిభ కనబరిచిన అధికారులకు మెమెంటోస్, ప్రశంస పత్రాలను కలెక్టర్, మంత్రి విశ్వరూప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ఎస్పి శ్రీకాంత్, కలెక్టర్ హిమాన్షు శుక్ల, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్,ఎంపీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవవేడుకలుబ్యాడ్మింటన్ సాత్విక్…
![WhatsApp Image 2024-01-26 at 4.02.08 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-4.02.08-PM.jpeg?resize=540%2C700&ssl=1)