తమిళి సై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా ఉండడంతో పాటు పుదుచ్చేరికి సంబందించి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసేందుకు తన గవర్నర్ పదవి ని వదులకుంటున్నట్లు తెలిపారు. ఆమె తమిళనాడు నుంచి ఎం.పీ. గా పోటి చేయనున్నట్లు తెలిపారు. బీ.జే.పీ. అధిష్టానం నిర్ణయం మేరకే రాజీనామా చేశారని తెలిపారు.