2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం 1.25 శాతం పడిపోయింది. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం… 2019లో 63.11 శాతం ఓట్లతో పోలిస్తే ఈసారి పార్టీకి 61.86 శాతం ఓట్లు వచ్చాయి. 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీల సంయుక్త ఓట్ల షేర్లు 33.93 శాతంగా నమోదయ్యాయి. ఇందులో కాంగ్రెస్కు 31.24 శాతం, ఆప్కి 2.69 శాతం ఓట్లు వచ్చాయి. ఉత్కంఠను రేకెత్తిస్తూ నెక్ అండ్ నెక్ ఫైట్లో కాంగ్రెస్ బీజేపీ నుండి బనస్కాంత స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది.
మంగళవారం గుజరాత్లోని బనస్కాంత లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జెనిబెన్ ఠాకోర్ 30,000 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ రేఖా చౌదరిపై విజయం సాధించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత గడ్డపై మొత్తం 26 స్థానాల్లో వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్ సాధించాలన్న బీ.జే.పీ. ప్రయత్నాన్ని నిలిపివేశారు.