నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కొమరగిరి లేఔట్ లో చేస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. కార్పొరేషన్, హౌసింగ్, మెప్మా విభాగాలకు చెందిన అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గృహ నిర్మాణ లక్ష్యాలను అధిగమించేందుకు స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా నవంబర్ చివరి నాటికి కొమరగిరి లేఔట్ లో 160 ఇళ్లను నూరు శాతం పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉండేలా సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ దశలో ఉన్న నాలుగు వేల ఇళ్లకు సంబంధించి దశలవారీ ప్రగతిని సమీక్షించారు. టిడ్కో ఇళ్ల కోసం లక్ష రూపాయలు జమ చేసిన లబ్ధిదారులకు జగనన్న కాలనీలలో కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణ ప్రగతిని కూడా కమిషనర్ సమీక్షించారు.