గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్.సి.యమ్ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు.
ఈ క్యాంప్ లో డా. గోపాల్, డా. అమృత, డా. తన్మయి, దంత వైద్యులు హాసిని, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సభ్యులు, ట్రినిటి హాస్పటల్ సిబ్బంది వైద్య సేవలను అందించారు. పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రీస్తుసంఘ సేవకులు మడకి జోయల్ రాజు, వైసి త్రీ యూత్ వారిని పిఠాపురం శాసనసభ్యడు పెండెం దొరబాబు, నగర పంచాయితి కమీషనర్, తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమములో ఆర్.సి.యమ్ చర్చ్ ఫాదర్ బర్తలోమియా, కౌన్సలర్ బి. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.