తాళ్లరేవు మండలం గోపులంక గ్రామ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కోరంగి సబ్ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి తణుకు గ్రామామం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏడుగురు యువకులు దసరా సెలవుల నిమిత్తం విహార యాత్రకు పయనమయ్యారు. వీరిలో కొందరు బీటెక్ చదువుతుండగా మరికొందరు డిగ్రీ వరకూ చదివారు. కాగా గోదావరి స్నానానికి గోపులంక గ్రామం సమీపంలో దిగి గోదావరి నదికి వెళ్లారు. గోదావరి వడి ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. వీరికోసం కోరంగి పోలీసులు స్థానికి మత్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు.
గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు
![OIP](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/OIP.jpg?resize=474%2C266&ssl=1)