Kakinada

గోపాలమిత్రలకు కనీసవేతనం 26వేలు చెల్లించాలని… -సి.ఐ.టి.యు.-

WhatsApp Image 2024-03-07 at 12.00.41 PM

గ్రామీణ ప్రాంతాలలో పాడి రైతులకు సేవలు అందించే గోపాల మిత్రలకు ఉద్యోగభద్రత కల్పించి, కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 11 కాకినాడ కలక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు. కార్యాలయంలో జరిగిన నాయకత్వ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సి.హెచ్. రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ… 2019 నుండి ఏ.ఐ. ఇన్సెంటివ్స్ చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం మానేసిందని అన్నారు.

పక్క రాష్ట్రం తెలంగాణాలో 10వేలు చెల్లిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో 6500 రూపాయిల వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న 6వేల యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ AHA పోస్టులలో ఇప్పటివరకు పని చేసిన గోపాల మిత్రులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

నాడు ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, మొబైల్ అంబులెన్సు ఏర్పాటులో ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే ఏమైందని ప్రశ్నించారు. పైడిమాండ్ల సాధన కోసం మార్చి 11న కాకినాడ కలక్టరేట్ వద్ద జరిగే ధర్నాకి గోపాలమిత్రలందరు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పి. అబ్బులు, టి. శ్రీనివాస్, బి. అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ