దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామపంచాయితీ కార్యదర్శి పై పిఠాపురం మండలం నవాఖంద్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీ వాణి జిల్లా పంచాయితీ అధికారినీ కలసి తమ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సమస్యల సమాచారాన్ని తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ సమావేశం తనకు తెలియకుండా ఏర్పాటు చేసి తీర్మానాలు చేయించడం ఎంతవరకు సమంజస్మని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న తమకు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి గ్రామ కార్యదర్శి తనను అంటరాని వారి వలె చూస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.