గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ… 169 ఉద్యోగాలకు 2018లో నోటిఫికేషన్ కు 25/5/2019 న పెట్టిన గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో 51 అక్షర దోషాలు, అనువాద దోషాలు, తప్పులు ఉన్నట్లుగా హైకోర్టులో అభ్యర్థులు కేసు వేసారని అన్నారు.
అయితే ఐదు తప్పులను మాత్రమే పరిగణంలోకి తీసుకున్నారు కానీ అప్పటి పోరాటాలను పరిగణంలోకి తీసుకుని 1:50 గా ఎంపిక చేశారన్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు 51 తప్పులను పరిగణించమని కేసు వేశారు, సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉంటుండగా గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష పెట్టి డిజిటల్ మూలంకన ప్రకారం ఫలితాలను విడుదల చేశారని అన్నారు. పేపర్ విధానంలో అర్హత కోలిపోయినవారంతా హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షను రద్దు చేయమని ఆదేశించారన్నారు.