రెండు వారాల్లో గ్రూప్ టు ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేస్తే, ప్రధాన పరీక్షకు చదువుకోవడానికి సమయం ఉంటుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని అన్నారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, వికలాంగుల రిజర్వేషన్ అమలు చేసి, నెగిటివ్ మార్కులను నాలుగు తప్పులకు ఒక మార్కుగా మార్పు చేసి, జాగ్రఫీలో ఓషినోగ్రఫీ సంబంధించి ఇచ్చిన రెండు ప్రశ్నలకు రెండు గ్రేస్ మార్కులు వేసి, పోస్ట్లు సంఖ్యను పెంచి 1:100గా మెయిన్స్ కు వెళ్లే అభ్యర్థులకు కటాఫ్ నిర్ణయించాలని ఏ.పీ.పీ.ఎస్.సీ. చైర్ మెన్ కి వినతి పత్రాన్ని అందచేసారు. ప్రభుత్వం వారు ఆందోళన చెందుతున్న నిరుద్యోగులకు ఎన్నికల కోడ్ లోపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, వయోపరిమితి 47కు పెంచి న్యాయం చేయాలని తెలిపారు.
గ్రూప్ 2 ఫలితాలపై ఏ.పీ.పీ.ఎస్.సీ. చైర్ మెన్ కి వినతి పత్రం…
![OIP (27)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/OIP-27.jpg?resize=1296%2C700&ssl=1)