ఆంధ్ర ష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీని ఢీకొనడం చంద్రబాబుతోనే సాధ్యమైందని కాకినాడ రూరల్ ఎన్నికల కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మాటట్లాడుతూ… మరి కొద్దిరోజుల్లో రాక్షస పాలన పోయి రామ రాజ్యం రాబోందని అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు టీ.డీ.పీ. కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను, మండపేట నియోజకవర్గం టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును వారి స్వగృహంలో టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తో ఆయన విడివిడిగా కలిసారు.
మొదట ఆయనకు పుష్పగుచ్చాలు అందించి దుశ్సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు… కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి నాగబాబు, కొప్పిశెట్టి సాయి, దమ్ము నూకరాజు, మల్లంపల్లి నారాయణ తదితరులు పేద్ద ఎత్తున పాల్గొన్నారు.