Political

చంద్రబాబు అక్రమ నిర్బంధంపై ఉద్యమం…

jyothula

   మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధం పై ఉద్యమం జరుగుతోందని కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు.  జిల్లా తెలుగు దేశం పార్టి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులో గత 34 రోజులుగా చంద్రబాబు జైలులో వున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, నూతన ఏపీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. వయస్సు, హోదా చూడకుండా అక్రమ కేసులో నిర్బంధం చేసి వేధిస్తున్నారన్నారు. లేని కేసులో వేధింపులు తగదన్నారు. స్కిల్ డవలెప్మెంట్ కేసులో 370కోట్ల రూపాయలు అవినీతి అని,27కోట్లు,24కోట్లు అని పొంతన లేని సమాధానాలు ప్రభుత్వం చెపుతోందన్నారు.

   వయస్సు, హోదా చూడకుండా చంద్రబాబు నాయుడును వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పరమర్శకు వస్తుంటే అడ్డుకున్నారన్నారు. దేశ విదేశాలలో ప్రజలు చంద్రబాబు కు అండగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు లక్ష సంతకాలు చేశారన్నారు. వీటిని గవర్నర్ కు పంపుతామని తెలిపారు.త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం అభియోగం మాత్రమే వచ్చిందని దానిపై కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు జైలులో కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, బుర్రి సత్యనారాయణ, తూము కుమార్, జియవుద్దీన్ జిలాని తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.