జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్:
టీడీపీ అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను నిపుణులైన డాక్టర్లు జైలు వద్ద అందుబాటులో ఉండి అవసరమైన వైద్యం, మందులు ఇస్తున్నారు. చంద్రబాబు అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్ తెలియజేశారు. చంద్రబాబుకు జైళ్ళో భద్రత ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఆయన సెక్యూరిటీ కోసం ఒక జైలర్ స్థాయి అధికారితోపాటు, మరో ఆరుగురు సిబ్బంది ఆయనకు అత్యంత దగ్గరలో ఉంచ్చామన్నారు. చంద్రబాబు వుండే బ్యారేక్ సమీపంలోకి ఇతర ఖైదీలు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఆయన కట్టుదిట్టమైన భద్రతా వలయంలో వున్నారని తెలిపారు.