విద్యార్ధినీ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం అని నారాయణ పాఠశాలల ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో రామారావు పేట నారాయణ ఇ-టెక్నోస్కూల్ పాఠశాల క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ఏజీఎం రాఘవేంద్రరావు ప్రారంభించారు. విద్యార్ధినీ విద్యార్ధులు క్రీడాస్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడాస్ఫూర్తి ప్రదానం అన్నారు. ప్రిన్సిపాల్ షర్మిల మాట్లాడుతూ… బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్ధినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఖోఖో, త్రోబాల్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ పోటీలు నిర్వహించగా, ఉత్సాహంగా పాల్గొన్నా విద్యార్థులకు జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుంకర మూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈపోటీల నిర్వహణలో అకడమిక్ డీన్ రమణారావు, పిఈటీ విజయ్ బాబు, ఉపాధ్యాయులు శ్రవంతి, శిరీష, బషీర్, పద్మలత, గోపాలకృష్ణ, కాంచన, అనిత, స్పందన, రష్మీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లోనూ రానించాలి
![IMG-20231111-WA0005](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231111-WA0005.jpg?resize=1152%2C700&ssl=1)