Viral

ఛత్తీస్‌గడ్ లో మందుగుండు కర్మాగారంలో ప్రేలుడు… 12 మంది మృతి…

fire_news_6049526_835x547-m

శనివారం ఛత్తీస్‌గడ్ లోని బెమెటారా జిల్లాలోని ఒక మందుగుండు కర్మాగారంలో పేటుడు సంభవించింది. ఆ ప్రమాదంలో పన్నెండు మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. బెర్లా బ్లాక్‌లోని బోరాసి గ్రామంలోని స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. చాలా మంది వ్యక్తులు శిధిలాల క్రింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం పేలుడుపై మెజిస్టీరియల్ విచారణను ఆదేశించింది. ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి దర్యాప్తును ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.