శనివారం ఛత్తీస్గడ్ లోని బెమెటారా జిల్లాలోని ఒక మందుగుండు కర్మాగారంలో పేటుడు సంభవించింది. ఆ ప్రమాదంలో పన్నెండు మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. బెర్లా బ్లాక్లోని బోరాసి గ్రామంలోని స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. చాలా మంది వ్యక్తులు శిధిలాల క్రింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఛత్తీస్గడ్ ప్రభుత్వం పేలుడుపై మెజిస్టీరియల్ విచారణను ఆదేశించింది. ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి దర్యాప్తును ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఛత్తీస్గడ్ లో మందుగుండు కర్మాగారంలో ప్రేలుడు… 12 మంది మృతి…
![fire_news_6049526_835x547-m](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/fire_news_6049526_835x547-m.jpg?resize=835%2C547&ssl=1)