Trending News

జగనన్నకు చెబుదాం-స్పందనకు 129 అర్జీలు..

WhatsApp Image 2023-12-04 at 4.05.06 PM

కాకినాడ లో కలెక్టరేట్ లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అర్జీదారులనుంచి 129 అర్జీలు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్ రెడ్డి తెలిపారు. అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి డీ.ఆర్‌.వో. కె. శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీ.ఈ.వో. ఎ. రమణారెడ్డి, తదితరులతో కలిసి హాజరై జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులకు డీ.ఆర్.వో. ఆదేశాలు జారీ చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, తదితరులకు సంబంధించి మొత్తం 129 అర్జీలు వచ్చాయి. అందిన ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందించాలని డీఆర్వో ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్ష‌న్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్