![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/Prathipati-Pullarao.jpg?resize=640%2C480&ssl=1)
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం, బెయిల్ రద్దై జగన్ మళ్లీ జగన్ జైలు పోవడం ఖాయమని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఒకవైపు స్కిల్ కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ రావడం, మరోవైపు యువగళం పునఃప్రారంభంతో వైకాపాలో వణుకు మొదలైందన్నారు ప్రత్తిపాటి. రాష్ట్రంలో వైకాపా రోజులు లెక్క బెట్టుకోవాల్సిందేనని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకవైపు .. భువనేశ్వరి, లోకేశ్ మరోవైపు రాష్ట్రం మొత్తం పర్యటించబోతున్నారని, ఆ హోరులోనే జగన్ కొట్టుకుబోతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27న యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జులు, ముఖ్య నాయకులతో జోన్-2 ఇన్ఛార్జిగా ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్ర విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కాకినాడలోని తెదేపా కార్యాలయంలో నాయకులతో ఆయన సమావేశమయ్యారు.