కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సి.ఐ. రమేష్ మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థి, విద్యార్థినులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి తద్వారా ప్రమాదాలను నియంత్రించగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఎస్.ఐ. కిశోర్ బాబు, ఏ.ఎస్.ఐ. రమణ మూర్తి , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జగన్నాధ పురం MSN చారిటీస్ లో ట్రాఫిక్ నిబంధనలపై సదస్సు….
![IMG-20231116-WA0037](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231116-WA0037.jpg?resize=1280%2C700&ssl=1)