Political

జగన్ రెడ్డి పాలనకు జనం తెరదించుతారు.. —– కొండబాబు ——

WhatsApp Image 2023-10-15 at 5.20.58 PM

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు తెరదించి, సైకో ప్రభుత్వాని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మద్దతుగా కొండబాబు స్థానిక 24 వ డివిజన్ నందు పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా పద్మనాభ నగర్ కనకదుర్గ ఆలయం, హనుమాన్ ఆలయం నందు చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే… జగన్‌ మోహన్ రెడ్డికి ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన జగన్‌ మోహన్ రెడ్డి తప్పుడు సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నాని, వైసీపీ ప్రభుత్వ రాజకీయ కుట్రలు, కక్షలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడేదే లేదని ఆయన అన్నారు.
జగన్‌ మాయమాటలు నమ్మి మోసపోయిన అన్ని వర్గాల వారు ఇప్పుడు చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారని, టీడీపీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాధరణ చూసి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన జగన్మోహన్‌ రెడ్డి స్కిల్‌ డెవలప్మెంట్ కుట్రకు పాల్పడ్డాడని వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాలిక నాని, కానూరి రాంబాబు, పెదపూడి కుమార్, కంటిపూడి సీతామహాలక్ష్మి, శ్రీనివాస చౌదరి, కంది కృప, పెదపూడి ప్రసాద్, వెంకటేశ్వరరావు, పాలిక సూర్య, బాబి, సాయి, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.