పిఠాపురం మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 257 జగ్గయ్య చెరువు ఇళ్ళ స్థలాల కోసం గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్న జగ్గయ్య చేరువును ఆక్రమించేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు.
దానిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకొని పారిశుధ్య కార్మికులకు నీడ కల్పించాలనీ కోరుతూ… వ్యవసాయ కూలీ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ కేశవరపు అప్పలరాజు, మున్సిపల్ శానటరీ వర్కర్స్ యూనియన్ నాయకులు శాఖ రామకృష్ణ సోమవారం కలెక్టర్ కారాలయం స్పందనలో పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సొంత ఇళ్ళు లేక అద్దె నివాసాల్లో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ భూమి జగ్గయ్య చెరువు ప్రాంతంలో లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలన్నారు. వారికి ఇళ్ళ నిర్మాణాలు చేసి ఇవ్వక పోయినా… కనీసం స్థలమైన కేటాయిస్తే పాకో, పందిరో వేసుకుని తల దాచుకుంటామని అన్నారు.