2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో పాటు, జనవరి నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తమకు చాలా సమయం లభిస్తుందని తెలియచేసింది. ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే తిరుపతి, అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది.