Political

జనసేనలో చేరిన ఎన్.ఆర్.ఐ. లు…

WhatsApp Image 2024-03-05 at 9.33.08 PM (1)

ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ. లు మోటుపల్లి హరిబాబు, శ్రీనివాస్ అడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన వీరిరువురూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీకి తమ వంతు మద్దతు తెలిపేందుకు పార్టీలో చేరినట్టు వీరు స్పష్టం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.