ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ. లు మోటుపల్లి హరిబాబు, శ్రీనివాస్ అడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన వీరిరువురూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీకి తమ వంతు మద్దతు తెలిపేందుకు పార్టీలో చేరినట్టు వీరు స్పష్టం చేశారు.
జనసేనలో చేరిన ఎన్.ఆర్.ఐ. లు…
![WhatsApp Image 2024-03-05 at 9.33.08 PM (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-05-at-9.33.08-PM-1.jpeg?resize=960%2C700&ssl=1)