Political

జనసేన ద్వారానే రాష్ట్ర భవిష్యత్… -జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల-

WhatsApp Image 2023-10-19 at 7.27.00 PM

రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక స్థితితో పాటు ప్రజలకు నష్టం కలుగుతుందని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే ఎంతో సుందరమైన కాకినాడ నగరంలో నేడు గంజాయి, భూకబ్జా వంటి అక్రమాలకు వైకాపా పాలనలో కాకినాడ అడ్డాగా మారిందని చెప్పారు. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాకినాడ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో జనసేన – టీడీపీ కలిసి సంయుక్త ప్రచారం నిర్వహిస్తామని దీనిని ఇరు పార్టీలు సహకరించాలని కోరారు. జనసేనాని పవన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుందని జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యంగా విద్య, వైద్య వసతులు మెరుగుపడతాయని సుధీర్ చెప్పారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన పీ.ఎ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దారుణమైన పాలన ఉందని ఇక్కడ ఉన్న పాలకులు అభివృద్ధి చేయకపోగా కాకినాడను మురికివాడగా మార్చారన్నారు. అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా చెత్త పన్ను వేసి చెత్త కూడా తీయట్లేదన్నారు. 2024 రాష్ట్రంలో జనసేన- టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్తా శశిధర్, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, తుమ్మల బాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.