రాష్ట్రంలో విలేకర్లు, ఫోటో జర్నలిస్టులపై వై.సీ.పీ. ప్రభుత్వ దాడులు చేయడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యన్ మండిపడ్డారు. వై.సీ.పీ. పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుపోవడం చాలా ధారుణమన్నారు. వై.సీ.పీ. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం మాహా సభ ఆవరణలో ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు చేసిన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడ దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డకోకపోవడం దురదృష్టకరం అని అన్నారు.
ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఇటీవల గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన విలేకరిపై ధాడి చేసి తీవ్రంగా కొట్టారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే తునిలో ఓ విలేకరిని హత్య చేశారన్నారు. ఈ పాలనలో జర్నలిస్టులపై హింస పెరిగిపోతోంది. పాత్రికేయులను, మీడియా యాజమాన్యాలను కట్టడి చేసేలా జీవోలు తీసుకువస్తున్నారు. వైసీపీ వైఖరిని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని ఆయన తెలియచేసారు.