Political

జర్నలిస్టులపై దాడులను ఖంఢించిన జనసేన అధినేత…

WhatsApp Image 2024-02-19 at 11.46.06 AM

రాష్ట్రంలో విలేకర్లు, ఫోటో జర్నలిస్టులపై వై.సీ.పీ. ప్రభుత్వ దాడులు చేయడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యన్ మండిపడ్డారు. వై.సీ.పీ. పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుపోవడం చాలా ధారుణమన్నారు. వై.సీ.పీ. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం మాహా సభ ఆవరణలో ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు చేసిన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడ దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డకోకపోవడం దురదృష్టకరం అని అన్నారు.

ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఇటీవల గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన విలేకరిపై ధాడి చేసి తీవ్రంగా కొట్టారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే తునిలో ఓ విలేకరిని హత్య చేశారన్నారు. ఈ పాలనలో జర్నలిస్టులపై హింస పెరిగిపోతోంది. పాత్రికేయులను, మీడియా యాజమాన్యాలను కట్టడి చేసేలా జీవోలు తీసుకువస్తున్నారు. వైసీపీ వైఖరిని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని ఆయన తెలియచేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.