జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలను కాకినాడ సిటీలో జనసేన పీ.ఏ.సీ. సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జగన్నాధపురం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద గల HMS వద్ద గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పీ.ఏ.సీ. సభ్యులు ముత్త శశిధర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిన బాబ్జీ , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, వాడ్రేవు లోవరాజు,పినిశెట్టి సురేష్,మల్లిపూడి శివాజీ, అక్షయ దుర్గ ప్రసాద్, బసవాణి నాగబాబు, పెద్దిరెడ్డి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.