కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు, సి.ఐ.టి.యు. నాయకులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. బుధవారం ఉదయం నుండి యధావిధిగా విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించారు.
ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ కు చేతికి అందుతున్న జీతం రూ. 12402 మాత్రమే. తాజా ఒప్పందం లో భాగంగా 2024 జనవరి నుండి రూ. 13502 చేతికి అందేలా రూ. 1100 పెంపుదల జరిగిందని తెలిపారు. మహిళలకు 17, పురుషులకు 16 క్యాజువల్ లీవులు అమలు చేయాలని, ఉగాది సందర్భంగా నూనె, సబ్బులు, చెప్పులు, టవల్స్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మట్టిఖర్చు రూపంలో రూ. 10,000 ఇవ్వడానికి, కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు జీతంతో కూడిన సెలవులు వంటి విషయాలపై ఒప్పందం కుదిరిందని చెప్పారు.