జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగాల్సిన బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ఉభయ సభలను పిలవడానికి కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను జూలై 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బడ్జెట్ సమావేశ వివరాలను ఎక్స్ లో ప్రకటించారు.