Exclusive

జ్యోతుల నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి పునాదులు…

WhatsApp Image 2024-05-04 at 2.51.36 PM

కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి 89 వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ వీధిలోని వివేక్ భవన్ లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి నిర్వహించారు. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… కాకినాడ పురపాలక సభ్యులుగా, అధ్యక్షులుగా ప్రగతి సేవలందిం చిన జ్యోతుల సీతారామ మూర్తి సి.వి. కె. రావు, మల్లాడి స్వామి. కె.ఈ. ప్రభాజో సెఫ్ పేరిట ఆగస్టు 15న స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించారన్నారు.

1982 నుండి 1992 వరకు పురపాలకునిగా పదేళ్ల కాలంలో జ్యోతుల సీతారామమూర్తి నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి నిర్వర్తించిన పునాదులన్నారు. ప్రజాహితం మేరకు కార్పోరేషన్ నూతన భవనానికి జ్యోతుల నామకరణం నాలుగు రోడ్ల కూడలిలో సీతారామ మూర్తి విగ్రహం ఏర్పాటు ప్రక్రియను నూతన ప్రభుత్వం చేపట్టాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవాసమితి అధ్యక్షుడు పెంకే నూకరాజు, చిరు వ్యాపారులు సంక్షేమ సంఘం కార్యదర్శి సరగడ రాంబాబు రెడ్డి పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.