రామచంద్రపురంలో 1996 డిసెంబర్ 29వ తేదీన జరిగిన శిరోముండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్షార్హం కావడం ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారా యణరాజు కలం ద్వారా పటిష్టమైన ఆధారాల తో వాస్తవాలను వెలుగు లోకి తెచ్చారని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. అన్ని అధారాలను లోకం ముందుంచిన కారణం గానే రాజకీయ బ్రష్టత్వం పట్టిన వ్యవస్థలతో ఆలస్యం అయినప్పటికీ.. టి.ఎస్.ఎన్. రాజు వార్త నిజమని న్యాయస్థానం తీర్పు ద్వారా వెల్లడ య్యిందని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది.
అప్పట్లో ఈ వార్త పై నిజనిర్ధారణ కమిటీగా న్యూ డెమోక్రసీ నాయకుడు జల్లూరి వేంకటేశ్వర్లు ఆధ్వర్యం లో రామచంద్రపురం లో ఘటన జరిగిన ప్రాంతానికి 1997 జనవరిలో వెళ్లి బాధితులను పరామర్శించే క్రమంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడిగా వెళ్ళడం జరిగిందన్నారు. టి.ఎస్.ఎన్. రాజు వంటి జర్నలిస్ట్ అభ్యుదయ సమాజానికి దిక్సూచి వంటివారని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిదని దహించక తప్పదన్నా రు.