Exclusive

టి.ఎస్.ఎన్. రాజు వల్లే శిరోముండనం కేసు వెలుగు చూసింది… -పౌరసంక్షేమసంఘం-

WhatsApp Image 2024-04-16 at 5.11.26 PM

రామచంద్రపురంలో 1996 డిసెంబర్ 29వ తేదీన జరిగిన శిరోముండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్షార్హం కావడం ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారా యణరాజు కలం ద్వారా పటిష్టమైన ఆధారాల తో వాస్తవాలను వెలుగు లోకి తెచ్చారని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. అన్ని అధారాలను లోకం ముందుంచిన కారణం గానే రాజకీయ బ్రష్టత్వం పట్టిన వ్యవస్థలతో ఆలస్యం అయినప్పటికీ.. టి.ఎస్.ఎన్. రాజు వార్త నిజమని న్యాయస్థానం తీర్పు ద్వారా వెల్లడ య్యిందని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది.

అప్పట్లో ఈ వార్త పై నిజనిర్ధారణ కమిటీగా న్యూ డెమోక్రసీ నాయకుడు జల్లూరి వేంకటేశ్వర్లు ఆధ్వర్యం లో రామచంద్రపురం లో ఘటన జరిగిన ప్రాంతానికి 1997 జనవరిలో వెళ్లి బాధితులను పరామర్శించే క్రమంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడిగా వెళ్ళడం జరిగిందన్నారు. టి.ఎస్.ఎన్. రాజు వంటి జర్నలిస్ట్ అభ్యుదయ సమాజానికి దిక్సూచి వంటివారని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిదని దహించక తప్పదన్నా రు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.