అదికార దాహం ఎంతటి దుశ్చర్యలకైనా పురిగొల్పుతుంది. ఆ దాహంతోనే కొందరు టీ.డీ.పీ. నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జండా ఎక్కడా ఎగురనివ్వరాదనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ముందుగా వల విసురుతున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరైతే తెలుగుదేశం బ్యానర్లు, ఫొటోలు పెడుతున్నారో వారిని గుర్తించి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవరోదాలు కల్పిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ… బైక్, కారు, ఇంటి స్థలం ఇలా ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని వారిని ప్రలోభపెట్టే దిశగా హామీలు గుప్తిస్తున్నారు. అప్పటికీ వారు లోబడని పక్షాన వారిని టార్గెట్ చేయాల్సి ఉంటుందని బెదిరిస్తున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బౌతిక దాడులు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు వాపోతున్నారు.