కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైoదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.