Telangana

టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు ఎంపిక పై ఉత్కంఠత…

revanth reddy

టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి పదవీకాలం ఈ నెల 7తో ముగియనున్న నేపథ్యంలో ఆయన వారసుడి నియామక ప్రక్రియను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ.ఐ.సీ.సీ. వేగవంతం చేసింది. ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ గురువారం కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తదుపరి టీ.పీ.సీ.సీ.

అధ్యక్షుడి విషయంలో తెలంగాణ నేతల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలను వేణుగోపాల్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, పార్టీకి ఆమోదయోగ్యత వంటి అంశాలను ఏ.ఐ.సీ.సీ. పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏ.ఐ.సీ.సీ. తదుపరి టీ.పీ.సీ.సీ. చీఫ్‌గా బీసీ లేదా ఎస్సీ నాయకుడిని ఎంచుకోవచ్చు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో