తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూకట్పల్లి ప్రాంతంలో ఒక మిని ట్రక్ వేగంగా రవడంతో అదుపుతప్పి అదే రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆమె అక్కడినుంచి కొంత దూర వెళ్లి పడింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందిచి భాదితురాలుని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురయ్యిన మహిళ సూర్యకుమారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబందించి కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఏసుపత్రిలో చికిత్స పొందుతోంది.