గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంచార్జి శ్రీ తిప్పల దేవన్ రెడ్డి ఆ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి తో నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ… నా కుటుంబం ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నమ్మకస్తులుగా ఉంటామని చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అన్నారు.
దేవన్ రెడ్డి మాట్లాడుతూ… నేను నా వ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్ళానని, వెళ్లేముందు సుబ్బారెడ్డి తో మాట్లాడి వెళ్ళానన్నారు. నేను తిరిగి సిటీ కి వచ్చే లోపు నాపై లేనిపోని పుకార్లు లేపారని అన్నారు. ఆ పుకార్లను నమ్మవద్దని మేము ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ పార్టీ కి కట్టుబడివుంతమన్నారు.