జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో వేలం పాటను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటకు సంబంధించిన వివరాలను డిసిసి బ్యాంక్ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేశారు. మండపేటలోని విజయ మహాల్ ఎదురుగా ఉన్న ఎకరం 33 సెంట్లు స్థలమును అందులో ఉన్న భవనాలకు వేలం పాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో మొత్తం 14 మంది పాల్గొనగా 10 లక్షల రూపాయలను ధరావత్తుగా నిర్ణయించారు. మూడు కోట్ల రిజర్వు ధరను నిర్ణయించగా మరో లక్ష బిడ్ పెంపుదల చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆధీకృత అధికారి కే. కృష్ణ శృతి మాట్లాడుతూ… పాటదారులు ప్రశ్నలు, అంశాలను పూర్తి వివరాలతో అడిగారని వాటిని తాము సేకరించి త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తామని అందువల్ల ఈ వేలం పాట రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వేలం పాటలో డిసిసి బ్యాంక్ సీ.ఈ.వో. ఆర్వి నరసింహారావు, డీ.ఎం., డీ.జీ.ఎం., పాటదారులు తదితరులు పాల్గొన్నారు.