సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి,, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని నిలదీస్తున్న, వందలాది మంది పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రయివేటికరణకే మొగ్గు చూపుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న వారు మౌనంగా ఉంటే ఏ ఒక్క ఎంపీ లేని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఎలా చెలా ఇస్తుందో ఈ చిత్రంలో చూపించడం జరిగిందన్నారు.
గత వేయి రోజులుగా ఉద్యమాలు జరుగుతున్న ప్రయివేటీకరణకు ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. ఈ సినిమాలో గద్దర్ నాలుగు పాటలు, గోరటి వెంకన్న మూడు పాటలు రాసారని సత్యారెడ్డి చెప్పారు. ప్రజలను చైతన్యం చేసేందుకు సినిమా నిర్మాణం చేశామన్నారు. గద్దర్ మాటలు, పాటలను రాసారని ఆయనకు ఈ సినిమా అంకితం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు మార్చుకుంటుందనే ఉద్దేశ్యంతో సినిమా నిర్మించామని తెలిపారు. విశాఖ ఎంపీ ఎమ్.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, పోరాట సమితి జేఏసీ నేతలు, ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకించే ప్రముఖ వ్యక్తులు, స్థానిక ప్రజలు, కార్మికులు నటించారని తెలిపారు. డిసెంబరు రెండవ వారంలో ఐదు భాషల్లో సినిమా విడుదల సన్నాహాలు చేస్తున్నామని సత్యా రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ నేత అడ్డాల శ్రీలక్ష్మి, ఆదిరాల జక్కరయ్య, అల్లి దావీదు, దాసరి అన్నారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.