అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్ 8 నుంచి నిరవదిక సమ్మెకు అంగన్వాడీ వర్కర్స్ సన్నద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ అమలు చేయటంలో విఫలమయ్యారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబిరాణి తీవ్రంగా విమర్శించారు. కాకినాడ సిఐటియూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అంగన్వాడీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమవుతుందని ఆరోపించారు. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు.