ఢిల్లీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. చాలా మంది గాయపడ్డారని టీవీ నివేదికలు తెలిపాయి. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో అర్ధరాత్రి పెద్ద మంటలు చెలరేగడంతో పదకొండు మంది నవజాత శిశువులు రక్షించడం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ వెంటనే స్పందించి తొమ్మిది ఫైర్ టెండర్లను సైట్కు పంపిందని తెలిపారు. డి.ఎఫ్.ఎస్. చీఫ్ అతుల్ గార్గ్ ప్రకారం… రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలయలేదు.
ఢిల్లీలో చిల్డ్రన్స్ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం…
![OIP (33)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/OIP-33.jpg?resize=474%2C318&ssl=1)