జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్సవం నవంబర్ 9 వ తారీఖున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులతో సమాజ వికాసానికి దోహ దపడేలా ప్రాజెక్ట్ లు రూపొందిండానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశా లలో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్స వానికి సంబంధించి విస్తృత ప్రచారానికి గాను రూపొందించిన గోడపత్రికను జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఆమే ఆవిష్కరించారు. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసు కోవడం అనే అంశంపై స్కూల్ స్థాయిలో నిర్వహించిన ప్రాజెక్టులకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన పాఠశాలలో మొదటి వంద స్థానాలు పొందిన పాఠశాలలకు జిల్లాస్థాయి లో బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్సవాన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి జీ.వీ.ఎస్. సుబ్రహ్మణ్యం తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్స్ బీ.వీ.వీ. సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వీ.కే. భీమారావు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ నంద్యాల మను విహార్ పాఠశాల ప్రధానోపా ధ్యాయిని విజయలక్ష్మీ పాల్గొన్నారు
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జరగనున్న జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్సవం…
![IMG-20231101-WA0005](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231101-WA0005.jpg?resize=1280%2C700&ssl=1)