తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 25 మంది మరణించగా, 60 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మాట్లాడుతూ… ఈ మరణాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని, సంఘటనను నిరోధించనందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించిన వ్యక్తుల మరణ వార్త విని నేను షాక్ అయినట్లు, బాధపడినట్లు తన ఎక్స్ కాతాలో పోస్ట్ చేసారు. ఈ కేసులో నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేశారని తెలిపారు. నివారించడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీ ఇచ్చారు.