గర్భిణీ స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పుష్కలమైన పోషకాహారం తో పాటు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలను సూచనలను పాటించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అనిత పేర్కొన్నారు. కాకినాడ గాంధీ భవన్ లో రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , ఉమెన్ డవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తో బాటు పడాల చారిటబుల్ ట్రస్ట్, పల్లె సిరి స్వచ్ఛంధ సంస్థల సంయుక్త సారథ్యంలో మాతా శిశు సంక్షేమ సంరక్షకులకు అవగాహన కల్పించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని డాక్టర్ అనిత అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంతోపాటు డయాబెటిక్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్యపరమైన సమస్యలపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కరమైన శిశువుతోపాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించవచ్చని తెలిపారు.