పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వై.సీ.పీ. మంత్రి కి భారీ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని బెదిరించడానికి వై.సీ.పీ మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చారు. అయితే ఓటు వెయ్యడానికి వచ్చిన ఉద్యోగులు ఆయన పై తిరగబడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రి పై ఉద్యోగులు తిరగబడటంతో పోలీసుల సాయంతో ఆయన వెనక్కి వెళ్లపోయాడు. మంత్రి చేసిన పనికి అక్కడున్న ఉద్యోగులంతా మండిపడ్డారు.