Exclusive

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే జనసేనపై నిందారోపణలు… -జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-

WhatsApp Image 2024-04-21 at 9.41.46 PM

ఎమెల్యే సీటు దక్కలేదన్న అక్కసుతోనే వై.సీ.పీ. గూటికి చేరినవాళ్ళు జనసేనానిపై అవాకులుచవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వీడియో సందేశంలో మాట్లాడారు… వాస్తవాలు వక్రీకరించేలా పోతిన మహేష్ అనుచిత వ్యాఖ్యలున్నాయని ఖండించారు. ఇటీవల పార్టీ మారిన మహేష్ అనతి కాలంలోనే వై.సీ.పీ. విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్నారన్నారు. బీ.సీ. సామాజిక వర్గానికి చెందిన మహేష్ కు పార్టీలో ఎంతో ప్రాధాన్యమిచ్చి ఉన్నత పదవులు ఇచ్చారని చెప్పారు.

శివశంకర్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి మహేష్ కు పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జీగా పార్టీలో సముచిత స్థానమిచ్చి గౌరవించారు. విజయవాడలో జనసేన పార్టీ అభివృద్ధికి పని చేయకున్నా భరించామని 2014కు ముందు, ఆ తర్వాత ఆయన ఆర్థిక స్థితి ఎలా పెరిగిందో అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. ఆధిపత్య ధోరణితో బెజవాడలో జనసైనికుల్ని బెదిరింపులకు గురి చేసి వారిని వేధించిన సంఘటనలు అనేకమున్నాయని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.