లీగల్ సర్వీస్ కమిటీ సూచన మేరకు తీర ప్రాంతంలో ఉన్న 69 గ్రామాలకే కాకుండా ఉప్పలంక, పగడాల పేట నుండి కోనపాప పేట వరకు ఉన్న మత్స్యకర గ్రామాలన్నింటికీ పరిహారం అందించాలని ది కాకినాడ మెరైన్ ఫిషర్మెన్ మల్టీపర్పస్ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు వరిపల్లి సత్యనారాయణ స్వామి తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకుగాను స్వామి కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… తీర ప్రాంతంలో 69 మత్స్యకార ప్రాంతాలకే రిలయన్స్, ఓ.ఎన్.జీ.సీ., జిఎస్టిసి పరిహారం అందుతుందని మిగిలిన మత్స్యకార గ్రామాలకు ఈ పరిహారం అందటం లేదంటూ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి లేఖ ద్వారా తెలియపరచగా వారు హైకోర్టు లెవిల్ కమిటీకి సిఫార్సు చేశారని తెలియజేస్తూ తనకు ఒక లేఖ వచ్చినట్లు స్వామి చెప్పారు.
తీర ప్రాంత మత్స్యకారులందరికీ పరిహారం అందించాలి…
![WhatsApp Image 2024-03-02 at 4.40.28 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-02-at-4.40.28-PM.jpeg?resize=1088%2C700&ssl=1)